హైదరాబాద్, 11 మార్చి (హి.స.)
గత వారం రోజులుగా బంగారం ధరల్లో
హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే పసిడి.. నేడు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై
రూ.300.. 24 క్యారెట్లపై రూ.330 తగ్గింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (మార్చి 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,200గా.. 24 క్యారెట్ల ధర
రూ.87,490గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
మరోవైపు వెండి ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి.. వరుసగా రెండో రోజు తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.1,000 తగ్గి.. రూ.98,000గా నమోదైంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..