తెలంగాణ, కామారెడ్డి. 11 మార్చి (హి.స.) పోలిస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి వారికి న్యాయం చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు సోమవారం స్వీకరించిన ఆయన నేడు అనగా మంగళవారం జిల్లాలోని భిక్కనూరు పోలీస్ స్టేషన్ ను విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ ఆఫీసర్లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతించారు. అనంతరం ఆయన స్టేషన్ లోని రిసెప్షన్ తోపాటు, కార్యాలయంలోని ఛాంబర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేయాలని సూచించారు. కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ సమయానికి అనుగుణంగా డ్యూటీ లు చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించే విధంగా చూడాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్