విజయవాడ, 11 మార్చి (హి.స.)
ఆదోని: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని మండలం పాండవగల్లు కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రెండు బైక్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల