విజయవాడ, 11 మార్చి (హి.స.)
విజయవాడ: తెదేపా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ను అపహరించి, బెదిరించిన కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను కోర్టు పొడిగించింది. వంశీని వర్చువల్గా జడ్డి ఎదుట జైలు అధికారులు ప్రవేశపెట్టారు. ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల