ముంబయి: , 11 మార్చి (హి.స.)దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. అమెరికా టారిఫ్ల ప్రకటనలు, ఆ దేశంలో నిరుద్యోగిత పెరగడం లాంటి పరిణామాలతో మదుపర్లు అప్రమత్తతను కొనసాగిస్తున్నారు. దీంతో మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 23,350 దిగువన ట్రేడింగ్ మొదలుపెట్టింది.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 388 పాయింట్లు నష్టంతో 73,726వద్ద.. నిఫ్టీ (Nifty) 113 పాయింట్లు కుంగి 22,346 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, జొమాటో, ఎంఅండ్ఎం, పవర్గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, బజాజ్ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, సన్ఫార్మా, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్యూఎల్ షేర్లు మాత్రమే లాభాల్లో కదలాడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు