విజయవాడ, 4 మార్చి (హి.స.)
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్, కండక్టర్ సహా 20 మందికి గాయాలయ్యాయి. వీరిని బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పినట్టుగా వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతున్నారని, తాము వద్దని వారించినా వినలేదని ప్రయాణికులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల