చిత్తూరు, 5 మార్చి (హి.స.): కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగానే వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా వివిధ పరీక్షల హాల్టికెట్లను విద్యార్థులు తమ ఫోన్లలోని వాట్సప్ ద్వారా పొందారు. ఇంటర్ విద్యార్థులు ఇటీవలే హాల్టికెట్లను ఈ విధానంలోనే పొందగా.. తాజాగా పదో తరగతి పిల్లలూ వారి హాల్టికెట్లను వాట్సప్లో డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఈ విధానం అమల్లోకి రావటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సాధారణంగా హాల్టికెట్లు పాఠశాలల్లో ఇచ్చేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 95523 00009 వాట్సప్ గవర్నెన్స్ నంబరుతో ఎవరికి వారు నేరుగా వాటిని తీసుకుంటున్నారు. చిత్తూరులోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మంగళవారం వారి ఫోన్లలో వాట్సప్ ద్వారా పదోతరగతి హాల్టికెట్లు డౌన్లోడ్ చేస్తూ కనిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల