పెరుగుతున్న ఎండల దృష్ట్యా సచివాలయం వద్ద కూల్ ఐడియా.. గేటు నెంబర్ 2 వద్ద టెంట్లు ఏర్పాటు చేసిన అధికారులు.
తెలంగాణ, హైదరాబాద్. 5 మార్చి (హి.స.) రాష్ట్రంలో క్రమంగా ఎండలు ముదురుతున్నాయి. మార్చి నెలారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. హైదరాబాద్ లో ఇప్పుడే 34 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో నగరవాసులు ఎండవేడికి అల్లాడిపోతున్నారు. అత్యవస
సచివాలయం వద్ద టెంట్లు ఏర్పాటు


తెలంగాణ, హైదరాబాద్. 5 మార్చి (హి.స.)

రాష్ట్రంలో క్రమంగా ఎండలు ముదురుతున్నాయి. మార్చి నెలారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. హైదరాబాద్ లో ఇప్పుడే 34 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో నగరవాసులు ఎండవేడికి అల్లాడిపోతున్నారు. అత్యవసర పనుల మీద బయటకు వస్తున్న నగర వాసులు మండుటెండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇదిలా ఉంటే పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సచివాలయం వద్ద అధికారులు 'కూల్' ఐడియా చేశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులు, అధికారులను తనిఖీ చేసే సమయంలో ఎండకు ఇబ్బంది పడకుండా గేట్ నంబర్ 2 వద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. టెంట్ నీడ కింద భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి లోపలికి అనుమతి ఇస్తున్నారు. ఈ నిర్ణయం ఇటు భద్రతా సిబ్బందితో పాటు సచివాలయానికి వచ్చి వెళ్లేవారికి ఉపశమనంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande