తెలంగాణ, ఖమ్మం. 5 మార్చి (హి.స.) ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 6న గురువారం ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఐటిఐ టేకులపల్లి ఖమ్మం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ లోని వై.ఎస్.కె. ఇన్ఫో టెక్ ప్రైవేటు లిమిటెడ్ లో అసెంబ్లింగ్ ఆపరేటర్, టెక్నికల్ టీమ్ సపోర్ట్, క్వాలిటీ చెకర్స్ ఖాళీల కోసం ఎస్ఎస్సి. ఐ.టి.ఐ. ఏదేని డిగ్రీ పాస్, ఫెయిల్ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపికైన వారికి వేతనం 16 వేలు ఉంటుందన్నారు. అలాగే హైదరాబాద్ లోని జిజే సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల కోసం ఏదేని డిగ్రీ అర్హత కలవారు దరఖాస్తు చేసుకోవాలని, వేతనం రూ.13 వేలు ఉంటుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్