అమరావతి:, 5 మార్చి (హి.స.)
ఏపీ సీఎం చంద్రబాబును ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాసులు నాయుడును సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని గౌరవిస్తామని చంద్రబాబు చెప్పారు. సీఎంకు శ్రీనివాసులు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో భాజపా నేత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల