ప్రారంభమైన తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు..
హైదరాబాద్, 5 మార్చి (హి.స.) ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. . ఇందుకోసం అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటలపాటు పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, గతంలో ఒక్క నిమిషం
తెలంగాణ ఇంటర్


హైదరాబాద్, 5 మార్చి (హి.స.) ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. . ఇందుకోసం

అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

మొత్తం మూడు గంటలపాటు పరీక్షలు

నిర్వహిస్తారు. అయితే, గతంలో ఒక్క నిమిషం ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నా లోపలికి అనుమతించేవారు కాదు. ప్రస్తుతం ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను ఇంటర్ బోర్డు ఎత్తివేసింది.

పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు.. అంటే 9.05 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా

దాదాపు తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో

అబ్బాయిలు 4,97,528 మంది ఉండగా..4,99,443 మంది అమ్మాయిలు ఉన్నారు. పరీక్షల

కోసం 1,532 సెంటర్లు ఏర్పాటు చేయగా..ఇందులో 49 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. ఉదయం

8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ అందజేశారు..

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande