హైదరాబాద్ మలక్ పెట్ లో వివాహితండిరిష.హత్య కేసులో కీలక ట్విస్ట్..వెలుగులోకి.
విజయవాడ, 5 మార్చి (హి.స.) హైదరాబాద్‌ మలక్‌పేటలో వివాహిత శిరీష్ హత్య కేసులో కీలక ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీషాను భర్త వినయ్, ఆడపడుచు సరిత చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సరిత అక్రమ
హైదరాబాద్ మలక్ పెట్ లో వివాహితండిరిష.హత్య కేసులో కీలక ట్విస్ట్..వెలుగులోకి.


విజయవాడ, 5 మార్చి (హి.స.)

హైదరాబాద్‌ మలక్‌పేటలో వివాహిత శిరీష్ హత్య కేసులో కీలక ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శిరీషాను భర్త వినయ్, ఆడపడుచు సరిత చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సరిత అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకే శిరీషను చంపినట్లుగా పోలీసులు తేల్చారు.

ఆరు నెలల క్రితమే శిరీష ఆడపడుచు సరిత అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. అప్పటి నుంచి ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ కుటుంబ పరువుపోతుందని శిరీష మందలించింది. దీంతో సరిత పగతో రగిలిపోతుంది. అదునుకోసం వేచి చూస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande