ఎమ్మెల్సీ ఎన్నికల విజేత శ్రీపాల్ రెడ్డిని అభినందించిన కెసిఆర్..
తెలంగాణ, 6 మార్చి (హి.స.) నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పిఆర్ టియు అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎర్రవల్లి నివాసంలో బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ను గురువారం కలిశారు. ఆయనకు పూలమొక్క ఇచ్చి అశీర్వాదం తీసుకున్నారు..ఈ సందర్భంగా ఎమ్మ
ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి


తెలంగాణ, 6 మార్చి (హి.స.)

నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పిఆర్ టియు అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎర్రవల్లి నివాసంలో బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ను గురువారం కలిశారు. ఆయనకు పూలమొక్క ఇచ్చి అశీర్వాదం తీసుకున్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన శ్రీపాల్ రెడ్డిని కెసిఆర్ అభినందించారు.. ఉపాధ్యాయులు ఎంతో ఆశతో గెలిపించారని, వారి సమస్యలను పరిష్కరించేందుక నిరంతరం కృషి చేయాలని శ్రీపార్ రెడ్డికి కెసిఆర్ సూచించారు.. కాగా... నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, రేవంత్ సన్నిహితుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande