ఏ.పీ, అమరావతి. 6 మార్చి (హి.స.)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఆరవ రోజు కొనసాగుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై శాసన సభలో సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పారు. గత ప్రభుత్వం వ్యవస్థీకృతంగా పీడీఎస్ రైస్ అంటే.. స్మగ్లింగ్ రైస్గా మార్చేశారన్నారు. అక్రమ రవాణా అరికట్టడానికి సివిల్ సప్లైస్ చట్టాలు, పీడీ యాక్టులలో సవరణలు తెచ్చి చట్టాలలో మార్పులు తెచ్చామన్నారు. త్వరలో క్యూఆర్ కోడ్ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..