విజయవాడ, 6 మార్చి (హి.స.)
ఏలూరు: ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల