చెన్నై, 7 మార్చి (హి.స.)
:ఎండ వేడిని తట్టుకునేలా ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు( )అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి రెండో వారం నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. కానీ, ఎండలు మండుతున్నా ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో పోలీసులు విధుల్లో ఉండాల్సిందే. ఎండల నుంచి వాహనచోదకులు ఉపశమనం కలిగించేలా ప్రధాన నగరాల్లోని సిగ్నల్స్ వద్ద పందిళ్లు ఏర్పాటుచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, చెన్నైను విభజించి కొత్తగా రూపొందిన ఆవడి పోలీసు కమిషనర్ కార్యాలయ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు( కమిషనర్ శంకర్ ఏసీ హెల్మెట్లు అందజేశారు. సహజ ఫైబర్తో రూపొందించారు. బ్యాటరీ ద్వారా ఏసీ యంత్రం పనిచేసి ట్రాఫిక్ పోలీసులకు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల