బేతుల్, 7 మార్చి (హి.స.)బొగ్గు గనిలో ఆకస్మాత్తుగా పైకప్పు కూలిపోయింది. దీంతో గనిలో పనిచేస్తున్న కార్మికులలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ విషాదకర ప్రమాదం మధ్యప్రదేశ్( బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, SDRF, పోలీసు ఓ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో గనిలో మరికొంత మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (WCL) పఠఖేడ ప్రాంతంలో జరిగింది. అక్కడ కార్మికులు ఛత్తర్పూర్-1 గని లోపల దాదాపు 3.5 కి.మీ దూరంలో ఉన్న కాంటూర్ మైనర్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆ సమయంలో పైకప్పు కూలడంతో చాలా మంది దాని కింద చిక్కుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురు ఉద్యోగులు మరణించినట్లు సమాచారం అందింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల