తెలంగాణ, హైదరాబాద్. 7 మార్చి (హి.స.) బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున
ఓ లారీ వర్క్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
బహదూర్పురా కిషన్ బాగ్ ప్రాంతంలో ఉన్న ఓ లారీ వర్క్ షాప్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఫైరిజంన్ల సహాయంతో మంటలను ఆర్పేశారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఆస్తి నష్టం పై వారు విచారిస్తున్నారు.. విషయం తెలుసుకున్న బహదూర్పురా ఎమ్మెల్యే మొబీన్ అక్కడికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్