తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతి కుమారి
తెలంగాణ, హైదరాబాద్. 7 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఐన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీల
ఐపీఎస్ బదిలీ


తెలంగాణ, హైదరాబాద్. 7 మార్చి (హి.స.)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఐన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు ఉన్నారు. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థాన చలనం కల్పించింది ప్రభుత్వం. మిగిలిన 14 మంది ఎస్పీలు బదిలీ అయ్యారు.

రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా వరంగల్ సీపీగా సన్రైత్ సింగ్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా సాయిచైతన్య కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహజన్ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్ భువనగిరి డీసీపీగా అక్షార్ష్ యాదవ్ సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్ సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్ వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్ మంచిర్యాల డీసీపీగా భాస్కర్ పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి సూర్యాపేట ఎస్పీగా నరసింహ సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు సీఐడీ ఎస్పీగా పి.రవీందర్

SIB ఎస్పీగా వై.సాయిశేఖర్ అడిషనల్ డీజీపీగా అనిల్ కుమార్ ఉమెన్ సేఫ్టీ వింగ్ గా చేతన

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande