సుప్రీంకోర్టుకి చేరిన తమిళనాడు ‘‘హిందీ’’ వివాదం
ఢిల్లీ,, 7 మార్చి (హి.స.)గత కొంత కాలంగా జాతీయ విద్యా విధానం(NEP), ‘‘త్రి భాష విధానం’’పై కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య తీవ్ర వివాదమే చెలరేగుతోంది. హిందీ భాషను తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే పార్టీత
సుప్రీంకోర్టుకి చేరిన తమిళనాడు ‘‘హిందీ’’ వివాదం


ఢిల్లీ,, 7 మార్చి (హి.స.)గత కొంత కాలంగా జాతీయ విద్యా విధానం(NEP), ‘‘త్రి భాష విధానం’’పై కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య తీవ్ర వివాదమే చెలరేగుతోంది. హిందీ భాషను తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే పార్టీతో పాటు ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాము ‘‘తమిళ్, ఇంగ్లీష్ ద్వి భాష విధానాన్ని’’ అమలు చేస్తామని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జాతీయ విద్యా విధానం అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. న్యాయవాది జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్‌లో, ఈ రాష్ట్రాలు రాజ్యాంగబద్ధంగా NEPని స్వీకరించడానికి, దాని అమలు కోసం ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోవడానికి బాధ్యత వహిస్తాయని వాదించారు.

హిందీని సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పిల్ సుప్రీంకోర్టులో దాఖలైంది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దడానికి కేంద్రం ఎన్ఈపీని ప్రయోగిస్తోందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ఈ వాదనల్ని మణి పిటిషన్ తోసిపుచ్చింది. స్టాలిన్ వ్యతిరేకత తప్పుడు, ఏకపక్షమైందిగా, రాజకీయంగా ప్రేరేపితమైనదిగా, ఉచిత మరియు ప్రభావవంతమైన విద్యను పొందే ప్రాథమిక హక్కుకు వ్యతిరేకం అని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande