నరసరావుపేట7 మార్చి (హి.స.): సినీనటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళిi)ని రెండ్రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు నరసరావుపేట పోలీసులు శనివారం, ఆదివారం విచారించనున్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై తెదేపా నేత కిరణ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోసానిని అదుపులోకి తీసుకున్న పల్నాడు పోలీసులు ఇటీవల నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడికి మార్చి 13 వరకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. పోసాని కస్టడీ కోరుతూ నరసరావుపేట పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం పోసానిని కస్టడీకి అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల