విజయవాడ, 8 మార్చి (హి.స.)
: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, సెంట్రల్ రైల్వే మొదటిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడుపుతోంది-షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో నేడు (మార్చి 08) పూర్తిగా మహిళా సిబ్బంది ఉన్నారు. వీరిలో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ సహా అందరూ మహిళలే. సెంట్రల్ రైల్వేస్ ఇదే విషయాన్ని అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఈ క్షణాలు అత్యంత గర్వకారణం, చారిత్రాత్మకమని అభివర్ణించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల