మామునూరు విమానాశ్రయాన్ని సందర్శించిన సిపిఎం పార్టీ నాయకులు
తెలంగాణ, 9 మార్చి (హి.స.) సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మామునూరు విమానాశ్రయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య మాట్లాడుతూ 1930లో నిజాం కాలంలో ఏర్పాటు కాబడిన మామునూరు విమానాశ్రయాన్ని 1981 వరకు సేవలందించిందన
మామునూరు ఎయిర్పోర్ట్


తెలంగాణ, 9 మార్చి (హి.స.)

సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మామునూరు విమానాశ్రయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య మాట్లాడుతూ 1930లో నిజాం కాలంలో ఏర్పాటు కాబడిన మామునూరు విమానాశ్రయాన్ని 1981 వరకు సేవలందించిందని తెలిపారు. ఆనాడు సిర్పూర్ కాగజ్నగర్ కాగిత పరిశ్రమ అభివృద్ధికి వరంగల్ లోని ఆజాజాహి మిల్స్ అభివృద్ధికి ఉపయోగపడిందని గుర్తు చేశారు. అనేకమంది ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు పర్యటనలకు ఉపయోగపడి అభివృద్ధికి సహకరించిందని అన్నారు.

మధ్యలో కొంత కాలం నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాన్ని ఇప్పుడు మళ్లీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించి ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నిధులు కేటాయించడం మంచి పరిణామం అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande