తిరుపతి, 9 మార్చి (హి.స.)
అహ్మదాబాద్ నుంచి హౌరా వెళ్లే హౌరా ఎక్స్ప్రెసు రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు ప్రయాణించే తిరుపతి జిల్లాలోని గూడూరు అడవయ్యకాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగిపోయాయి. ఈ విషయాన్న గమనించిన స్థానికులు రైలు వచ్చే సమయంలో రెడ్ క్లాత్ ద్వారా లోకోపైలట్ను అప్రమత్తం చేశారు. దీంతో అతను రైలును ఆపేశాడు. దీనితో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
విరిగిన పట్టాలకు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టిన అనంతరం ఈ మార్గం గుండా నడిచే రైళ్లు అన్ని యధావిధిగా ప్రయాణించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..