హైదరాబాద్, 9 మార్చి (హి.స.)బంగ్లాదేశ్ అమ్మాయిల వ్యభిచారం కేసులో పోలీసులు, ఎన్ఐఏ విచారణను ముమ్మరం చేశారు. ఇటీవల ఖైరతాబాద్, చాదర్ ఘాట్ పరిధిలో కొందరు యువతులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఖైరతాబాద్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసులు ఆరుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. వారిలో నలుగురు యువకులతో పాటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మూడు రోజుల కస్టడీలో రెండో రోజు విచారణను కొనసాగిస్తున్నారు. రేపటితో విచారణ ముగియబోతోంది. ఈ ఆరుగురిని ఎన్ఐఏ, సీఐ సెల్ అధికారులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
ఇక, చాధర్ఘాట్ పోలీస్ స్టేషన్లో పరిధిలో కూడా మరో ఎనిమిది మంది పట్టుబడ్డారు. వారిని ఈనెల 11వ తేదీన పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 13వ తేదీ వరకు వీరిని విచారించబోతున్నారు. బంగ్లాదేశ్, బర్మా నుంచి వీరు దేశంలోకి ఎలా వచ్చారనే విషయంపై పోలీసులు ప్రధానంగా ఆరా తీస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు