కదిరి, 9 మార్చి (హి.స.)
: కదిరిలో స్వయంభువుగా వెలిసిన నృసింహస్వామి ప్రహ్లాద సమేత ఖాద్రీశుడిగా విరాజిల్లుతున్నాడు. ఏటా ఫాల్గుణ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణతో మొదలవుతున్నాయి. 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే కదిరి పట్టణం నలువైపులా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. తిరువీధుల్లో మరమ్మతులు చేశారు. ఏర్పాట్లపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల