కొలిక్కి వస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
హైదరాబాద్, 9 మార్చి (హి.స.) తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇంఛార్జ
తెలంగాణ కాంగ్రెస్


హైదరాబాద్, 9 మార్చి (హి.స.)

తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. కాగా.. ఒప్పందంలో భాగంగా సీపీఐకి ఒక్క ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల కూర్పు చేయనున్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి.. బీసీ లేదా ఓసీకి సీటు కేటాయించే అవకాశం ఉంది. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ ( నల్గొండ డీసీసీ), నెహ్రూ నాయక్ (మహబూబాబాద్) పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓసీ కోటాలో జెట్టి కుసుమ కుమార్, గాంధీ భవన్ ఇంఛార్జ్ కుమార్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande