హైదరాబాద్, 27 మే (హి.స.)
ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రోగులు, సిబ్బంది , ఆవసరాన్ని తీర్చేందుకు ఆర్వోప్లాంట్ను ప్రారంభిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్ అన్నారు. దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్ సంస్థ సహకారంతో దవాఖానలోని ఎనిమిది ప్రాంతాలలో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రారంభించిన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులు, వారి సహాయకులు, దవాఖాన సిబ్బందికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్