నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 625 పాయింట్లు డౌన్..!
ముంబై, 27 మే (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలతో పాటు కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఫలితంగా మార్కెట్లు పతనమయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 82,038.20 పాయింట్ల వద్ద
స్టాక్ మార్కెట్


ముంబై, 27 మే (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం

నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలతో పాటు కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఫలితంగా మార్కెట్లు పతనమయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 82,038.20 పాయింట్ల వద్ద ప్లాట్గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. కొద్దిసేపటికి కోలుకోగా.. మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. అమ్మకాల ఒత్తిడితో ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. ఇంట్రాడేలో 82,410.52 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. కనిష్టంగా 81,121.70 పాయింట్లకు తగ్గింది. చివరకు 624.82 2 కొనసాగుతున్నది. .. 81,551.63 ລ້

నిఫ్టీ 174.95 పాయింట్లు పతనమై.. 24,826.20 వద్ద స్థిరపడింది. దాదాపు 1893 షేర్లు లాభపడగా.. 1898 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, సన్ఫార్మా, అదానీ పోర్ట్స్, నెస్లే, భారత్ ఎలక్ట్రిక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, జేఎస్ఈబ్ల్యూ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, ఎంఅండ్రం, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, టీసీఎస్, ఐసీఐసీఐ, రిలయన్స్, ఎక్స్టెర్నల్, విప్రో తదితర షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా.. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.9 శాతం పతనమైంది. ఆటో, నిఫ్టీ ఐటీ 0.7 శాతం మేరకు పతనమయ్యాయి. ఆయిల్-గ్యాస్ సూచీలు 0.6 శాతం పడిపోగా.. మెటల్ 0.5 శాతం తగ్గగా.. పీఎస్యూ బ్యాంక్, రియాల్టీ 0.25శాతం పెరిగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande