తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 28 మే (హి.స.)
ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం
కలిగించాలనే సదుద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ తన సతీమణి ని పాల్వంచ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో చేర్పించారు. కాగా, కలెక్టర్ సతీమణి బుధవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గర్భవతి అయినప్పటి నుంచి జిల్లా కలెక్టర్ ప్రతినెలా ఆమెను పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకుని వచ్చి పరీక్షలు చేయిస్తూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ క్రమంలో కలెక్టర్ సతీమణికి నెలలు నిండడంతో బుధవారం హాస్పిటల్కు తీసుకువచ్చారు. జిల్లా వైద్య సమన్వయ అధికారి రవిబాబు పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాంప్రసాద్, సర్జన్ సోమరాజు దొర, డాక్టర్ ప్రసాద్ సమక్షంలో నర్సింగ్ ఆఫీసర్ స్వర్ణలత గైనకాలజిస్టులు సరళ, అనూష సిజేరియన్ ఆపరేషన్ చేశారు. తల్లీ, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు