హైదరాబాద్, 28 మే (హి.స.)
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఆయనకు నివాళి అర్పించారు. ఈ ఉదయం వాళ్లు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతను స్మరించుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్ జయింతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులర్పించారు. మనవడు దేవాన్ష్ తో కలసి ఘాట్ కు వచ్చిన ఆమె ముందుగా తండ్రి సమాధి పై పూలు చల్లి అంజలి ఘటించారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్