ముంబై, 29 మే (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపు లాభ - నష్టాల మధ్య చలించాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్లు అండతో తిరిగి పుంజుకున్నాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 24,800 పైన ముగిసింది.సెన్సెక్స్ ఉదయం 81,591.03 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,312.32) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,106.98 81,816.89 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 320 పాయింట్ల లాభంతో 81,633 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 24,892.60 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 81 పాయింట్ల లాభంతో 24,833.60 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు 85.50 వద్ద ముగిసింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు