జమ్మూ, 10 జూన్ (హి.స.)
ప్రధాని మోడీ ఇటీవల జమ్మూకాశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే పెద్దది. ఈ వంతెనను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. అయితే ఈ వంతెన ఇప్పుడు విమాన ప్రయాణికులకు టూరిస్ట్ ప్లేస్గా మారింది.
ప్రస్తుతం విమానాలు చినాబ్ బ్రిడ్జి మీదగా వెళ్తున్నాయి. వంతెన సమీపంలోకి రాగానే పైలట్లు ప్రత్యేక ప్రకటన చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన వచ్చిందంటూ అనౌన్సెమెంట్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులంతా అద్దాల్లోంచి చూస్తూ తరిస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికులంతా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. విమానాలు చినాబ్ బ్రిడ్జి మీదగా వెళ్తుండగా పైలట్లు ప్రత్యేక ప్రకటన చేస్తున్నారని.. ఆ సమయంలో ప్రయాణికులంతా తమ మొబైల్లో దృశ్యాలను బంధిస్తున్నారని.. అంతేకాకుండా ఇంజనీర్లు రూపొందించిన అద్భుతాన్ని కొనియాడుతున్నారని తెలిపింది. విమానాలు.. చినాబ్ వంతెన మీదగా వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు