హైదరాబాద్, 10 జూన్ (హి.స.)
ఇటీవల కాలంలో మోసగాళ్లు కొత్త
దారులను ఎంచుకుంటున్నారు. అమాయక ప్రజలను మోసం చేసి ఎలాగైనా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా బీహార్ లోని పూర్ణియా జిల్లాలో చోటు చేసుకుంది. ఉద్యోగాల పేరుతో పలువురు యువకులను మోసం చేసి.. లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏకంగా ఏడాది పాటు నకిలీ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసి.. కార్యకలాపాలను కూడా నిర్వహించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
వివరాల్లోకి వెళితే.. మోహనీ గ్రామంలో రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి గ్రామీణ రక్షాదళ్ పేరిట నకిలీ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశాడు. స్థానిక యువతను ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆకర్షించి, వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నిందితుడిని అరెస్టు చేసినట్లు సమాచారం.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..