న్యూఢిల్లీ, 10 జూన్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలోన ద్వారక ప్రాంతం శబ్ద అపార్ట్మెంట్లో ఈ రోజు (జూన్ 10న) ఉదయం 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తులో అగ్నికీలలు చుట్టుముట్టాయి. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఆ భవనంలోని ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా కిందకు దూకేశారు.. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయ. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, సమాచారం అందుకున్న ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భవనంలోని ఇతర అంతస్తులకు కూడా మంటలు నెమ్మదిగా అంటుకుంటున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. భవనం నుంచి భారీగా పొగ వెలువడుతుండటంతో.. సహాయక చర్యలకు అటంకం కలుగుతుందని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..