మంగుళూరు, 10 జూన్ (హి.స.)కేరళ తీరంలో కంటైనర్ కార్గో షిప్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేరళలోని బేపోర్ తీరంలో సింగపూర్కు చెందిన వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 22 మంది సిబ్బందిలో 18 మందిని నావికాదళ నౌక INS సూరత్ రక్షించింది. అయితే.. మంటలు చెలరేగగానే నౌక లోని 18 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వారిలో నలుగురు గల్లంతయ్యారు. 14 మందిని మాత్రం కోస్ట్గార్డ్ , నేవీ సిబ్బంది కాపాడారు. శ్రీలంక నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో నౌకలో ఈ ప్రమాదం జరిగింది. సింగపూర్కు చెందిన MV వాన్ హాయ్ నౌకలో మంటలు చెలరేగిన సమయంలో 40 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన నౌకలో 650 కంటైనర్లు ఉండగా 20 కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. మంటలను ఆర్పడానికి నేవీతో పాటు కోస్ట్గార్డ్ సహాయక చర్యలు చేపట్టాయి. ఐఎన్ఎస్ సూరత్ నౌక కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. దాదాపు 270 మీటర్ల పొడవు ఉన్న ఈ నౌక ఈనెల 7న కొలంబో తీరం నుంచి బయల్దేరింది. ఇది ఇవాళ్టికి ముంబయికి చేరుకోవాల్సి ఉంది. కాని నిన్న ఉదయం నౌకలో పేలుడు జరగడంతో భారీ నష్టం జరిగింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు