అమరావతి, 12 జూన్ (హి.స.):పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ( ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీక్ కావడంతో ముగ్గురు కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అందులో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందినవారు పరిమి చంద్రశేఖర్, సరగడం కుమార్ మృతులుగా గుర్తించారు. బైడూ భైసాల్ అనే కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ