తాళం వేసిన ఇంట్లో ఇద్దరు చిన్నారుల.మృతదేహాలు లభ్యం
అమరావతి, 13 జూన్ (హి.స.) , : తల్లి వదిలి వెళ్లిపోయింది.. తండ్రి ఏమయ్యాడో తెలీదు. నాలుగు రోజులుగా తాళం వేసిన ఇంట్లో మంచం మీద ఇద్దరు చిన్నారుల మృతదేహాలు. హృదయాలను కలచివేసే ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మైలవరానికి చెందిన వేములమడ రవిశంకర్, చంద
తాళం వేసిన ఇంట్లో ఇద్దరు చిన్నారుల.మృతదేహాలు లభ్యం


అమరావతి, 13 జూన్ (హి.స.)

, : తల్లి వదిలి వెళ్లిపోయింది.. తండ్రి ఏమయ్యాడో తెలీదు. నాలుగు రోజులుగా తాళం వేసిన ఇంట్లో మంచం మీద ఇద్దరు చిన్నారుల మృతదేహాలు. హృదయాలను కలచివేసే ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మైలవరానికి చెందిన వేములమడ రవిశంకర్, చంద్రికలకు లక్ష్మీ హిరణ్య (9), లీలాసాయి (7) సంతానం. రెండు నెలల కిందట పిల్లల్ని భర్త దగ్గరే వదిలేసి చంద్రిక ఎక్కడికో వెళ్లిపోయింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన రవిశంకర్‌ తండ్రి లక్ష్మీపతి.. తాళం వేసి ఉన్న గది నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించారు. కిటికీ నుంచి చూడగా పిల్లలిద్దరు మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. తలుపులు తెరిచి చూడగా ఇద్దరూ చనిపోయినట్లు తెలుసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదుచేశామని పోలీసులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande