అమరావతి, 12 జూన్ (హి.స.)సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించింది.. మలి అడుగు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏడాది ప్రజా పాలనపై ఆయన ఎక్స్లో ట్వీట్చేశారు. ‘సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ (NDA) కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నాం..’ అని ఆయన తెలిపారు. అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే ‘పేదల సేవలో’, 'పెన్షన్లు, ‘అన్న క్యాంటిన్లు’, దీపం-2, ‘తల్లికి వందనం’, 'మత్స్యకార సేవలో'...లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామన్నారు. మెగా డిఎస్సీతో (Mega DSC) టీచర్ ఉద్యోగాలు...పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి