తెలంగాణ, మేడ్చల్. 16 జూన్ (హి.స.)
ఎల్లంపేట మున్సిపాలిటీలో
విలీనమైన గ్రామాలను రావల్ కోల్ తండా, సైదోనిగడ్డ తండాలలో మల్కాజిరి ఎంపీ ఈటెల రాజేందర్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా తండాలోని అంగన్వాడి కేంద్రాలను డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నగరానికి కూతపేట దూరంలో ఉండి రోడ్డు మీద నుండి లోపలికి రావడానికి లైట్లు లేక తండా ప్రజలు దారుణమైన స్థితిలో ఉన్నారన్నారు. అనేక సంవత్సరాలుగా ఈ గ్రామంలో మురికినీళ్ళన్నీ పంట పొలాల మీదకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీళ్లు పారుతుంటే దుర్గంధంతో వరి కోసే సమయంలో మిషన్లు రావడం లేదన్నారు.
మురికి కాలువ సమస్యలు తీర్చాలని, తండా లోపలికి రావడానికి లైట్లు పెట్టించాలని గ్రామస్తులు కోరారని ఈటల రాజేందర్ తెలిపారు. తనను ఎంపీగా ఈ ప్రాంత ప్రజల సమస్యలను అతి తొందరలో పరిష్కారం చేస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు