అమరావతి, 17 జూన్ (హి.స.)
అమరావతి: స్వర్ణాంధ్ర విజన్ 2047 పకడ్బందీగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ అమలుకు నిపుణులను నియమించాలని నిర్ణయించింది. నియోజకవర్గానికి ఒకరు చొప్పున 175 నియోజకవర్గాల్లో యంగ్ ప్రొఫెషనల్స్ని నియమించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ