అమరావతి, 17 జూన్ (హి.స.)
చీరాల: బాపట్ల జిల్లా చీరాల-బాపట్ల సరిహద్దులోని సముద్ర తీరాన్ని రియల్టర్లు చదును చేస్తుండటంతో మత్స్యకారులు అడ్డుకున్నారు. తీర ప్రాంతంలో రిసార్ట్స్కు డిమాండ్ ఉండటంతో రియల్టర్ల కళ్లు సముద్రతీరంపై పడ్డాయి. ఈ నేపథ్యంలో చీరాల మండలం వాడరేవు, విజయలక్ష్మిపురం గ్రామాల మధ్య ఈపురుపాలెం కాలువ ప్రవహిస్తోంది. చీరాల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు సముద్రంలో కలిసే విధంగా అప్పట్లో కాలువ నిర్మించారు. తుపాను సమయాల్లో ఈ కాలువ ద్వారా సముద్రంలోని బోట్లను తీసుకొచ్చి మత్స్యకారులు సురక్షితంగా ఉంచుతారు. మంగళవారం సముద్ర తీరంలో జేసీబీ, ట్రాక్టర్లతో చదును చేస్తుండగా.. ఆ పనులను విజయలక్ష్మిపురం మత్స్యకారులు పెద్ద ఎత్తున చేరుకుని అడ్డుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ