అమరావతి, 17 జూన్ (హి.స.)
తిరుమల: రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు పెట్టాలని ధర్మకర్తల మండలి ప్రతిపాదించిందని, పేరు మార్పుపై ఏవియేషన్ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించినట్టు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ ముగిసింది. అనంతరం సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వివరించారు. ‘‘బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న శ్రీవారి ఆలయం చిన్నగా ఉంది. పెద్ద ఆలయం నిర్మించాలని డీకే కోరారు. స్థలం కేటాయించగానే ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ