అమరావతి,
నెల్లూరు: క్వార్ట్జ్ అక్రమ తరలింపు వ్యవహారం కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. నెల్లూరు ఎస్సీ, ఎస్టీ మెజిస్ట్రేట్ కోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. వైకాపా ప్రభుత్వ హయాంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు గోవర్ధన్రెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా కేసులో జోడించారు. ఈ కేసులో కాకాణి నాలుగో నిందితుడి (ఏ4)గా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ