అమరావతి, 16 జూన్ (హి.స.)
:ఎన్టీఆర్ జిల్లాలో మరో మున్సిపాలిటీని టీడీపీ) కైవసం చేసుకుంది. కొండపల్లి మున్సిపాలిటీ () చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. చైర్మన్గా టీడీపీకి చెందిన చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్గా చుట్టుకుదురు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్పర్సన్గా ఇండిపెండెంట్ అభ్యర్థి కరిమికొండ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. అయితే కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠం నెలకొంది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( దగ్గరుండి మరీ అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ