జగిత్యాల, 16 జూన్ (హి.స.)
వేధింపులకు తాము భయపడేది లేదని నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా తమ నేతలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని, ఇలాంటి వేధింపులకు తాము భయపడబోమని, ధైర్యంగా అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు. వానాకాలం పంట సీజన్ మొదలైందని, రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నార్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చిందని, అది కూడా 60శాతం మంది రైతులకే ఇచ్చిందని, మిగిలిన 40శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..