అమరావతి, 17 జూన్ (హి.స.)
తిరుపతి: కొందరు ఆటోవాలాల ఆగడాలకు చెక్పెట్టేలా పోలీసులు క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొదటి దశలో తిరుపతిలోని 200 ఆటోలను డిజిటలైజేషన్ చేశారు. తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణమాచ్చారి ఆధ్వర్యంలో సోమవారం పోలీసు పరేడ్ గ్రౌండులో ఆటోల డిజిటలైజేషన్ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఆటోకు డ్రైవర్ వెనుక సీటులో ట్రాఫిక్ పోలీసులు తయారు చేసిన క్యూఆర్ కోడ్తో పాటు అందులో వున్న ఎనిమిది అంశాలతో కూడిన స్టిక్కర్ను అతికించారు. ఎవరైనా ఆటో డ్రైవర్లు తమతో దురుసుగా ప్రవర్తించినా, మద్యం తాగి నడిపినా, ఇతర విలువైన వస్తువులు ఆటోలో పోగొట్టుకున్నా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ఇబ్బంది పెట్టినా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపితే చాలు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ