అమరావతి,
యోగా అభ్యాసానికి ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు. వెంగళరావుసాగర్ ఏనుగుకొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి సహా జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు. యోగా జీవనశైలిలో భాగమైనప్పుడే ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. జూన్ 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొనాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ