అమరావతి, 17 జూన్ (హి.స.)
యోగా విశిష్టతను ప్రజలందరికీ తెలియజేయడం కోసమే నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు క్రీడా మైదానంలో ఐదు వేల మందితో నిర్వహించిన యోగాంధ్ర మాసోత్సవాల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్తో పాటు మంత్రి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడంతోపాటు రోజూ యోగా చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ వార్త చదివారా
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ