తెలంగాణ, సిద్దిపేట. 16 జూన్ (హి.స.)
దుబ్బాక ఎమ్మెల్యే గా గెలిచిన ఏ
నాయకుడైన అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, శిలాఫలకాలు పెట్టామ... వాటిపై తమ పేరు ఉందా అని మాత్రమే చూసుకున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ను సబ్ పోస్ట్ ఆఫీస్ గా మెరుగుపరిచారు. ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా పోస్ట్ ఆఫీస్ వున్నా అన్ని రకాల సేవలకు నోచుకోలేదని, గ్రామానికి చెందిన కొందరు యువకులు సబ్ పోస్ట్ ఆఫీస్ గా మార్చాలని తన దృష్టికి తీసుకువచ్చారని, వారు కోరిన మూడు నెలల వ్యవధిలోనే పోస్టల్ అధికారులతో మాట్లాడి పోస్ట్ ఆఫీస్ ను, సబ్ పోస్ట్ ఆఫీస్ గా మార్చడం జరిగిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు